మహేష్‌ బాబు లాంటోళ్లు ఇకపై జాగ్రత్త పడాల్సిందే

స్టార్ హీరోలుగా వెలుగుతున్నవాళ్లు యాడ్స్ లో కూడా సంపాదన మొదలుపెడతారు. కొంతమంది హీరోలైతే ముఖ్యంగా మహేష్‌ బాబు లాంటి హీరోలైతే సినిమాల కంటే యాడ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.

అలాంటి వారందరికీ అప్పుడప్పుడూ లీగల్ గా గట్టి షాకులే తగులుతుంటాయి. తాజాగా మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అంటే రియల్ ఎస్టేట్ సంస్థ తన కస్టమర్స్ ను మోసం చేసింది.

ఆల్రెడీ అమ్మేసిన ఫ్లాట్స్, ప్లాట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను అక్రమంగా మరో వ్యక్తికి కట్టబెట్టింది. దీనివల్ల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టు కనిపెట్టారు. సదరు సంస్థ హెడ్ ను అరెస్ట్ కూడా చేశారు పోలీస్ లు. అయితే ఇలాంటివి సాధారణంగా మహేష్‌ లేదా ఇంకో స్టార్ ను చూసే నమ్మకంతో కొంటారు వ్యక్తులు. ఇలా మోసపోయిన తర్వాత సదరు హీరోల వల్ల, బ్రాండ్ అంబాసిడర్స్ పై నమ్మకంతో కొని మోసపోయాం అని బాధపడుతుంటారు.

అలాంటి వారు సదరు సెలబ్రిటీస్ పై కేస్ లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మహేష్‌ పై ఎవరైనా కేస్ పెడతారా లేదాఅనేది పక్కన బెడితే.. ఇలాంటి వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. కీడెంచి మేలెంచాలి. అవసరమైతే ఏం జరిగినా లీగల్ గా ఎదుర్కొనేలా డాక్యుమెంట్స్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. లేదంటే ఎవరిదో వ్యాపారంలో ఎవరో చేసిన తప్పులకు వీళ్ల బ్రాండ్ బద్దలవుతుంది.

Related Posts