రీ షూటింగ్ లో ఖుషీ మూవీ

రీ షూట్.. ఈ మాట బిజినెస్ పై ప్రభావం చూపిస్తుంది. అంటే ముందు అనుకున్న కంటెంట్ బాలేకపోవడం వల్లే కదా రీ షూట్ కు వెళ్లేది అనేది వారి ఫీలింగ్. అందుకే మాగ్జిమం మేకర్స్ రీ షూట్ అనే మాటను బయటకు రానివ్వరు. అయితే తాజాగా ఈ మాట విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ఖుషీ చిత్రానికి వినిపిస్తోంది.

ఖుషీ 2022లోనే ప్రారంభం అయింది. తర్వాత సమంతకు ఆరోగ్యం బాలకపోవడంతో షూటింగ్ లేట్ అయింది. బట్ అప్పటికే 70శాతానికి పైగా అయిపోయిందని చెప్పారు మేకర్స్. సమంత వచ్చిన తర్వాత ఒక్క నెల రోజుల్లోనే పూర్తి చేస్తారు అనుకున్నారు. సమంత గత మార్చిలోనే ఈ సెట్స్ లో జాయిన్ అయింది. అంటే ఇప్పటికి మూడు నెలలు అవుతోంది. అయినా ఇంకా షెడ్యూల్స్ బ్యాలన్స్ ఉన్నాయి. అంటే ఈ చిత్రాన్ని రీ షూట్ చేస్తున్న కారణంగానే ఇంత లేట్ అవుతుందనేది టాలీవుడ్ టాక్.


సమంత హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు షూటింగ్ ఆగిపోయింది. ఆ టైమ్ లోనే దర్శకుడు కంటెంట్ ను రీ రైట్ చేసుకున్నాడట. అప్పటికే షూట్ చేసిన చాలా సన్నివేశాలను మళ్లీ రాసుకోవడం.. కొన్ని సీన్స్ ను పూర్తిగా మార్చేయడం జరిగిందట. దీంతో అన్నిటినీ మళ్లీ రీ షూట్ చేయాల్సి వస్తోంది.

ఇది ముందే తెలుసు కాబట్టి.. షూటింగ్ లేట్ అవుతుందనే.. రిలీజ్ డేట్ ను తెలివిగా సెప్టెంబర్ 1న పెట్టుకున్నారు. అంటే అంత వర్క్ పెండింగ్ లో ఉందని చాలామంది అప్పుడే ఊహించలేకపోయారు. బట్ వీరికి తెలుసు. కొత్త సీన్స్ తో పాటు పాత సీన్స్ ను కూడా మళ్లీ షూట్ చేయాలని. అందుకే సేఫ్ చాలా దూరం రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. ఇక ఇప్పటికీ ఓ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ మూవీ. ఇంకా రెండు షెడ్యూల్స్ వరకూ వర్క్ ఉందని టాక్.


ఇంతకు ముందు నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్‌ చిత్రాలు రూపొందించిన శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మరి ఈ రీ షూట్ ఖుషీకి ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి.

Related Posts