పుష్ప 2లో జానీ మాస్టర్ సాంగ్..శ్రీవల్లి ని మించి ఉండబోతుందా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న చిత్రం పుష్ప 2. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ సాంగ్ కంపోజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని స్వయంగా జానీ మాస్టర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన దర్శకుడు సుకుమార్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇందులో సుకుమార్ తో పాటుగా జానీ మాస్టర్ వైఫ్ కూడా ఉన్నారు.

పుష్ప పార్ట్ 1 లో శ్రీవల్లీ సాంగ్ ని కంపోజ్ చేసింది జానీ మాస్టరే. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 కోసం మరోసారి టీమ్ లో జాయిన్ అవడంతో శ్రీవల్లీ లాంటి మరో అద్భుతమైన పాట ఉండబోతుందని కన్‌ఫర్మ్ అయింది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Related Posts