ఖుషీ కోసం అందరూ వస్తున్నారు

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషీ. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇండియాలో కూడా ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే వచ్చిన పాటలతో సినిమాపై భారీ అంచనాలు వచ్చాయి. ప్రతి పాటా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇలా పాటలు హిట్ అయితే సినిమాకు విపరీతంగా కలిసొస్తుంది. అది ఈ సినిమాకు కనిపిస్తోంది. ఎలా చూసినా ఓ బ్లాక్ బస్టర్ లుక్ తో ఉందీ సినిమా. ఇక ఖుషీ ట్రైలర్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం మేకర్స్ ఓ కొత్త ఆలోచన చేశారు.


ఖుషీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోంది. ఇక్కడ ఎలాగూ మన మీడియా ఉంటుంది. అలాగే మిగతా రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ట్రైలర్ విడుదల చేయడం కంటే అక్కడి మీడియానే ఇక్కడికి రప్పించడం బెటర్ అని మిగతా భాషల మీడియాను హైదరాబాద్ కు ఆహ్వానించారు.

యస్.. ఇప్పటి వరకూ తెలుగు మీడియాకు సంబంధించిన మనోళ్లే ఇతర ప్రాంతాలకు.. అంటే బెంగళూరు, ముంబై వంటి నగరాలకు ఆయా భాషల సినిమాల కవరేజ్ కోసం వెళ్లారు. ఈ సారి ఖుషీ కోసం వాళ్లందరూ వస్తున్నారన్నమాట. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయితే.. అంటే ఏ ఇబ్బందులూ లేకుండా ఉంటే.. మిగతా ప్యాన్ ఇండియన్ సినిమాలు కూడా ఇలాగే చేయొచ్చు.

Related Posts