ధమాకా రిపీట్ అవుతుందా..?

కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే చాలు.. ఇక అది క్రేజీ కాంబో అవుతుంది. అవి రిపీట్ అయితే మార్కెట్ వాల్యూ పెరుగుతంది. బిజెనెస్ కూడా మారుతుంది. అయితే ఇలాంటి కాంబోస్ వెంట వెంటనే సెట్ కావడం అరుదుగా జరుగుతుంది. అదే ఇప్పుడు జరగింది. బ్లాక్ బస్టర్ ధమాకా కాంబినేషన్ రిపీట్ అవుతుంది.

మాస్ మహరాజ్ రవితేజ, శ్రీ లీల జంటగా మరో సినిమా రాబోతోంది. అదీ సేమ్ బ్యానర్ మైత్రీలోనే. ఈ బ్యానర్లో నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ధమాకా వంద కోట్లు కొల్లగొట్టింది. రొటీన్ కంటెంట్ అయినా ఈ జోడీ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ జంటతో అదే బ్యానర్ లో మరో సినిమారాబోతోంది. అయితే ఈ సారి దర్శకుడు గోపీచంద్ మలినేని. గోపీచంద్ రీసెంట్ గా ఇదే బ్యానర్ లో వీర సింహారెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టాడు.


రవితేజ- గోపీచంద్ మలినేని కలిసి ఇదే బ్యానర్ లో క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ కొట్టి ఉండటం విశేషం. ఎలా చూసినా బ్లాక్ బస్టర్ కాంబోలో సినిమా సెట్ అయింది. ఈ యేడాది దసరా నుంచి ఈ మూవీ సెట్స్ మీదికి వెళుతుంది. ఓ బలమైన కథతో రాబోతోన్న ఈ మూవీతో ఈ క్రేజీ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నారు.

Related Posts