శ్రీకాకుళంలో సందడి చేస్తున్న చైతన్య, సాయిపల్లవి

‘లవ్‌స్టోరీ’ హిట్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘తండేల్’. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. ‘కార్తికేయ 2’ వంటి బడా హిట్ తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీకాకుళంలో జరిగిన మత్స్యకారుల ఇతివృత్తంతో.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాకోసం చైతన్య సముద్రంలో వేటాడటం నేర్చుకున్నాడు. శ్రీకాకుళం మాండలికాన్ని ఔపోసాన పట్టాడు. ఈ మూవీలోని తాను పోషిస్తున్న పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని చైతన్య ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ తాజాగా శ్రీకాకుళంలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. ఈ సందర్భంగా.. శ్రీకాకుళంలో సందడి చేస్తున్న నాగచైతన్య, సాయిపల్లవికి అక్కడ ప్రేక్షకుల నుంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. డిసెంబర్ 20న ‘తండేల్’ పలు భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts