బిగ్ బాస్ లో ఎంటర్ అయ్యేది వీళ్లేనా..

బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది.అందుకు సంబంధించిన సందడి కూడా మొదలైంది. ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.ఆల్రెడీ ఆయన్నుంచి ఓ ప్రోమో కూడా వచ్చింది. అయితే గత రెండు సీజన్స్ చూస్తే చాలా డల్ ఉన్నాయి. మరీ చివరి సీజన్ కు అయితే కనీస రేటింగ్స్ కూడా లేదు. దీంతో ఈ సారి మామూలుగా ఉండదు అనేలా ఉందీ ప్రోమో. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ నాగ్ పాడుతూ వెళ్లిన ప్రోమో ఆకట్టుకుంది.

ఇక ఇప్పటికే ఈ సీజన్ లోకి వెళ్లబోయే వీళ్లే అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా గంగవ్వ కూడా మళ్లీ బిగ్ బాస్ కు వెళుతున్నా అంటూ తెలుగు 70ఎమ్ఎమ్ ఇంటర్వ్యూలో ఎక్స్ క్లూజివ్ గా చెప్పింది. అది నిజమా కాదా అనేది నిర్వాహకులు ఇప్పుడప్పుడే చెప్పరు. అయితే తాజాగా ఒక లిస్ట్ అయితే బయటికి వినిపిస్తోంది. ఈ లిస్ట్ ప్రకారం చూస్తే దాదాపు వీరు ఖరారైనట్టే అంటున్నారు. కొన్ని సీజన్స్ నుంచి రియల్ కపుల్ ను కూడా అనుమతిస్తున్నారు. ఈ సారి ఆ కపుల్ అమర్ దీప్ చౌదరి, తేజస్వినిగా తెలుస్తుంది. వీళ్లు సీరియల్స్, షోస్ ద్వారా ఇప్పటికే కొంత పాపులారిటీ తెచ్చుకున్నారు.ఈ ఇద్దరూ దాదాపు బిగ్ బాస్ హౌస్ కు వెళుతున్నట్టుగానే చెబుతున్నారు.


ఇక కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్కలకు పెద్ద ప్రాబ్లమ్ గా మారి తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న నటి శోభాశెట్టి కూడా ఈ లిస్ట్ లో ఉంది. తన క్యారెక్టర్ సీరియల్ లో నెగెటివ్ గా ఉన్నా.. టివి షోస్ లో మాత్రం హంబుల్ గానే కనిపిస్తుంది. మరి తన ప్రభావం ఎలా ఉంటుందో.
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అనే పాటతో తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయిన పేరు మోహన భోగరాజు. సింగర్ అయిన మోహన ఈ పాటలో స్వయంగా నర్తించింది కూడా. తను కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైందంటున్నారు.యూ ట్యూబర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న శ్వేత నాయుడు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతోందంటున్నారు.

వీరితో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నా.. వీరు మాత్రం ఆల్మోస్ట్ ఖాయం అంటున్నారు. అంటే ఇంకో పది లేదా పన్నెండు మంది పేర్లు బయటికి రావాల్సి ఉందన్నమాట.

Related Posts