మెగా ఫ్యామిలీలో మరో విడాకులు

ఊహిస్తున్నదే అయింది. కొన్నాళ్లుగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక.. ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఈ ఇద్దరూ అఫీషయల్ గా విడాకులు తీసుకున్నారు.

ఆరు నెలల ముందే వీరు విడాకులు కోసం కూకట్ పల్లి కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేశారు. అంతకు ముందు నుంచే వీరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని అప్పుడే వార్తలు వచ్చాయి. అవి నిజం కాదు అని మెగా అభిమానులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుకున్న టైమ్ లో సడెన్ గా ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియమ్ లో వీరు ఒకరినొకరు “అన్ ఫ్రెండ్” చేసుకున్నారు.

దీంతో ఇక విడాకులు ఖాయం అనుకున్నారు. బట్ ఇరు కుటుంబాల పెద్దలు కలిసి చర్చించి ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారు అనే భావించారు చాలామంది. బట్ అవేవీ వర్కవుట్ కాలేదు. ఈ మంగళవారం నిహారిక, చైతన్యలకు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది కూకట్ పల్లి కోర్ట్.


నిజానికి వీరు వ్యక్తిగతంగా విడిపోయి చాలా రోజులే అవుతోంది. అందుకే ఈ మధ్య కాలంలో జరిగిన వరుణ్‌తేజ్ ఎంగేజ్మెంట్ కు కూడా చైతన్యతో పాటు అతని కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. మరోవైపు ఈ విడాకులు విషయాన్ని రీసెంట్ గానే చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేశాడు. మొత్తంగా మెగా ఫ్యామిలీలో మరో విడాకులు అధికారికంగా పూర్తయింది. మరి ఈ వ్యవహారంపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Related Posts