క్రేజీగా మారుతోన్న అల్లు అర్జున్ లైనప్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల లైనప్ క్రేజీగా మారుతోంది. ఒకటి తర్వాత మరొకటిగా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ‘పుష్ప 2‘తో బిజీగా ఉన్న బన్నీ.. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ‘అల.. వైకుంఠపురములో‘ చిత్రాన్ని నిర్మించిన హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో రూపొందే బన్నీ-త్రివిక్రమ్ కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదిన్నర సమయం పడుతోందట. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కించనున్నాడు త్రివిక్రమ్. అందుకే.. త్రివిక్రమ్ కంటే ముందే బోయపాటితో ఓ సినిమాని లైన్లో పెట్టనున్నాడట అల్లు అర్జున్.

‘సరైనోడు‘ తర్వాత అల్లు అర్జున్ – బోయపాటి కాంబోలో సినిమాని నిర్మించడానికి గీతా ఆర్ట్స్ సిద్ధంగా ఉంది. ఇక.. త్రివిక్రమ్, బోయపాటి చిత్రాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లోనూ ఓ సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మించనుంది. ప్రభాస్ తో ‘స్పిరిట్‘ పూర్తైన తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇంకా.. బన్నీ విష్ లిస్ట్ లో ‘జవాన్‘ డైరెక్టర్ అట్లీ కూడా ఉన్నాడు. మొత్తంమీద.. రాబోయే మూడు, నాలుగేళ్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్యాలెండర్ ఫుల్ ప్యాక్డ్ గా ఉందన్నమాట.