క్రిస్మస్ కానుకగా ఈ శుక్రవారం కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. కొన్ని థియేటర్లోకి వస్తుంటే.. కొన్ని ఓటీటీలోకి వస్తున్నాయి. ఏ ఏ సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయో.. ఏ ఏ సినిమాలో ఓటీటీలోకి వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ది మ్యాట్రిక్. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్లో వస్తున్న చిత్రం ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్. లానా వచౌస్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని కథానాయకుడిగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది. భారతీయ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ టోర్నమెంట్ 1983 ప్రుడెన్షియల్ కప్. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. ఆ మధుర స్మృతులను వెండితెర పై ఆవిష్కరించే ప్రయత్నమే 83. ఈ చిత్రం డిసెంబరు 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గూడు పుఠాణి. ఈ థ్రిల్లర్ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం బ్యాక్డోర్. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్రేప్ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ఆశ ఎన్కౌంటర్. డిసెంబరు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఓటీటీల విషయానికి వస్తే..అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా కె.వి.గుహన్ తెరకెక్కించిన చిత్రం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో విడుదల కానుంది. మలయాళ నటుడు టోవినో థామస్ కథానాయకుడిగా బసిల్ జోసెఫ్ తెరకెక్కిస్తున్న సూపర్హీరో అడ్వెంచర్ ఫిల్మ్ మిన్నల్ మురళి. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీల్లో ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది విడుదల కానుంది. డిసెంబరు 24న నెట్ఫ్లిక్స్ వేదికగా మిన్నల్ మురళి స్ట్రీమింగ్కానుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం అతరంగీ రే. ఈ సినిమా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. పరంపర వెబ్ సిరీస్ డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మానాడు. ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం సత్యమేవ జయతే. దానికి కొనసాగింపుగా సత్యమేవ జయతే 2 వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది