ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. వీరిద్దరూ కలసి ఆర్య, ఆర్య 2 చిత్రాలు చేశారు. ఇప్పుడు వీరిద్దరికీ పుష్ప ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాని ముందుగా ఒక పార్ట్ గానే అనుకున్నారు. ఆతర్వాత రెండు పార్ట్ లుగా మార్చడం జరిగింది.
ఈ నెల 17న వరల్డ్ వైడ్ గా పుష్ప ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే… ఈ సినిమా ఎలా పుట్టిందో బన్నీ బయటపెట్టాడు. తాజాగా ఢీ 13 డ్యాన్స్ రియాలిటీ షోకి బన్నీ గెస్ట్ గా వెళ్లాడు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. సుకుమార్, నేను కలిసి సినిమా చేయాలని అనుకున్నప్పుడు సరైన కథతోనే రావాలని ముందే ఫిక్సయ్యాం. సుక్కు కూడా సరైన కథతోనే నీ దగ్గరికి వస్తానని.. నీతో మామూలు సినిమా మాత్రం చేయనని చెప్పాడు.
ఆ తరువాత కొన్నాళ్లకు చెప్పినట్టుగానే సరైన కథతో నా దగ్గరకు వచ్చాడు. సుక్కు తెచ్చిన కథ విన్న తరువాత ఇది నాకు సరైన కథ అనిపించింది. అందుకే ఈ సినిమా చేశాం అని పుష్ప వెనకున్న సీక్రెట్ ను బయటపెట్టాడు. మరి.. ఈ పాన్ ఇండియా మూవీతో బన్నీ, సుక్కు కలిసి ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.