సమంత గత కొన్ని రోజులుగా వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సమంత ఇప్పుడు తన మనసులో మాటలను బయటపెట్టింది. బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో సమంత స్పందిస్తూ.. ఎన్నో ఏళ్లు కష్టపడి నా కెరీర్ను నిర్మించుకున్నాను. 2021లో వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఇబ్బందుల కారణంగా నా కలలన్నీ శిథిలమైపోయాయి. నేనెంతో కుంగుబాటుకు లోనయ్యాను.
ఇక సోషల్మీడియా గురించి చెప్పాలంటే.. నటీనటుల్ని తమ అభిమానులకు చేరువ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. అయితే.. కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వాళ్లు నా జీవితంలో భాగమైపోయారు కానీ.. మరికొంత మంది మాత్రం.. ట్రోల్ చేస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. వారందర్నీ నేను కోరేది ఒక్కటే.. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను కానీ, మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఓ విధానం ఉంటుంది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది సమంత.
అయితే… తమిళ హీరో సిద్దార్థ ట్విట్టర్ లో స్పందిస్తూ.. నేటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ తనంతట తనే జరగదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానండి.. అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో సిద్ధార్థ్ ఈ కామెంట్స్ ను సమంతని ఉద్దేశించే చేశాడని.. సామ్ పెంచిపోషించిన అభిమానులే ఆమెని ట్రోల్ చేశారన్న అర్ధం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారని డిస్కసన్ జరుగుతుంది. మరి దీని పై సిద్ధార్థ కానీ.. సమంత కానీ స్పందిస్తారేమో చూడాలి.