విలక్షణ శైలి ఉన్న దర్శకుడు సాగర్

తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు సీనియర్స్‌ అంతా కన్నుమూస్తున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ కన్నుమూయడంతో పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన వయసు 70యేళ్లు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ గురువారం ఉదయం 6 గంటలకు చెన్నైలోని తన ఇంట్లో మృతి చెందారు.


సాగర్ కుటుంబం గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలోని నిడమర్రు గ్రామానికి చెందిన వారు. తండ్రి మునసబుగా చేసేవారు. పిల్లలకు మంచి చదువు చెప్పించాలని.. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన మద్రాస్ కు వెళ్లారు. అలా సాగర్ చిన్నతనం నుంచీ చెన్నైలోనే ఉన్నారు. చదువైన తర్వాత కొన్నాళ్ల పాటు ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసినా.. ఓ బంధువు వల్ల మానేయాల్సి వచ్చింది. అటుపై అట్లూరి పుండరీకాక్షయ్య తనయుడుతో ఉన్న పరిచయంతో దర్శకుడు బి.వి ప్రసాద్ వద్ద మహ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. అలా ఆయన వద్దే దాదాపు పన్నెండేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తను దర్శకుడు కావాలని నిర్ణయించుకున్న తర్వాత అప్పట్లో అందరిలానే కృష్ణగారి వద్దకు వెళ్లారు. ఆయన బిజీగా ఉండటంతో మరో వ్యక్తి సలహా మేరకు నరేష్‌ హీరోగా రాకాసి లోయ అనే సినిమాతో దర్శకుడుగా మార�