మళ్ళీ బాలీవుడ్ పై హాట్ కామెంట్స్ చేసిన ఆర్జీవి

మళ్ళీ నోటికి పనిచేప్పిన ఆర్జివీ.. ఒక్క ట్వీట్ తో బాలీవుడ్ స్టార్ హీరోల పరువు తీసేసిన వివాదాల వర్మ

RGV on Bollywood Hero’s:- టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాల వర్మ నిత్యం రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఎవరిపై ప్రశంసలు కురిపిస్తాడో.. ఎపుడు ఎవరిపై విరుచుకుపడతాడో ఎవరికీ అంచనాలకు అందని నేచర్ ఈ డైరెక్టర్ ది. కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గానిలిచిన ఆర్జీవీ తాజాగా సోషల్ మీడియా వేదికగా మళ్ళీ తన నోటికి పనిచెప్పాడు. ఈ సారి టాలీవుడ్ యంగ్ హీరో సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ. బాలీవుడ్ హీరోల పరువుని బజారున పెట్టేశాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ కార్తికేయ 2 సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించాడు.

నిఖిల్ సిద్దార్ద్, అనుపమ హీరో, హీరోయిన్లుగా నటించిన చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 13వ తేదీ విరిలీజ్ అయింది. ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన ప్రతి భాషలోనూ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా హిందీలో స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలను బీట్ చేసి మరీ సూపర్ హిట్ అందుకుంది

కార్తికేయ 2 విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెంట్ సాధించి లాభాల బాటలో పరుగులు పెడుతుంది. మరోవైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి హీరోలు సైతం కార్తికేయ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్జీవీ కూడా సోషల్ మీడియా వేదికగా కార్తీకేయ 2 పై హీరో నిఖిల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. బాలీవుడ్ హీరోలపై తన ధైన శైలిలో కామెంట్స్ చేశాడు.

రామ్ గోపాల్ వర్మ కార్తికేయ 2 సక్సెస్ గురించి మాట్లాడుతూ.. నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రోజు రోజుకీ బీ టౌన్ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ.. మరిన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ , యష్ , ప్రశాంత్ నీల్ ల కేజిఎఫ్ సినిమాల కంటే కూడా నిఖిల్ సినిమా బ్లాక్ బస్టర్ అని రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్షాలుగా కీర్తించే అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లను యంగ్ హీరో నిఖిల్ తో పోలుస్తూ.. వారి పరువుని తీసినంత పనిచేశాడని క