లోకేష్‌ కనకరాజ్ ను ఫాలో అవుతోన్న ప్రశాంత్ నీల్..?

ప్రశాంత్ నీల్ సౌత్ సినిమా పూర్తిగా మారుతోంది. కొత్త తరం దర్శకులు పాత తరం హీరోలతోనూ మ్యాజిక్ లు చేస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటూ సరికొత్త “సినీవర్స్” క్రియేట్ చేస్తున్నారు. హాలీవుడ్ లాగా ఒక సినిమాను మరో సినిమాకు లింక్ చేస్తూ దూసుకుపోతున్నారు. దీనికి ఆద్యుడుగా లోకేష్ కనకరాజ్ ను చెప్పాలి. ఖైదీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన లోకేష్ తర్వాత మాస్టర్ తో కమర్షియల్ గా మంచి హిట్ కొట్టాడు. రీసెంట్ గా వచ్చిన విక్రమ్ తో అతను టాప్ డైరెక్టర్స్ లీగ్ లోకి వెళ్లిపోయాడు. విడుదలైన ఐదు వారాలవుతోన్నా విక్రమ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికే కోలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ తెలుగులో విడుదల చేసిన నితిన్ ఫాదర్ కు భారీ లాభాలు తెచ్చింది. ఇక విక్రమ్ తో అతను చేసిన ప్రయోగం కొత్త తరం ఆలోచనలకు ప్రతిబింబం అయింది.అంతకు ముందు తీసిన ఖైదీకి కొనసాగింపుగా ఉంటూనే విక్రమ్ 2కు లీడ్ ఇచ్చేలా చివర్లో సూర్య పాత్రను ఎంటర్ చేశాడు. అది థియేటర్స్ ను దద్దరిల్లిపోయేలా చేసింది.

అలాగ ఖైదీ టీమ్ ను కూడా ఇన్వాల్స్ చేసి హాలీవుడ్ రేంజ్ లో ఓ యూనివర్స్ క్రియేట్ చేశాడు. ఈ ఐడియా ఇండియాలోనే ఇంతకు ముందు ఏ సీక్వెల్ కూ లేదు. అందుకే బాగా వర్కవుట్ అవుతోంది. దీంతో ఇదే ప్లాన్ ను తనూ ఫాలో అవుతున్నాడు ప్రశాంత్ నీల్.హ్యాట్రిక్ హిట్స్(ఉగ్రమ్, కెజీఎఫ్‌1,2) తో తనూ టాప్ డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం కూడా అతని స్టైల్లోనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోంది. అలాగే తను కెజీఎఫ్‌ 3 కూడా తీయబోతున్నాడు కదా.. ? దానికి లీడ్ ను చాప్టర్ 2లోనే ఇచ్చాడు. అయితే లోకేష్‌ కనకరాజ్ చేసిన ప్రయోగాన్ని తనూ చేయబోతున్నాడు. సలార్ చిత్రంలో కెజీఎఫ్ స్టార్ యశ్ ను కూడా చూపించబోతున్నాడట. యస్.. సలార్ చివర్లో యశ్ వస్తాడు అని చెబుతున్నారు. ఆ పాత్ర మళ్లీ తన కెజీఎఫ్‌ 3కి లీడ్ లా ఉంటుందట. అలాగే ఇటు సలార్ కు సైతం కొనసాగింపు ఉండేలా ప్లాన్ చేసుకున్నాడని టాక్. మొత్తంగా కొత్తదనంతో ఇండియన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి లోకేష్‌ ను ఫాలో అయితే మాత్రం తప్పేంటీ..?

<