ఆస్కార్ క్వాలిఫై ఓటింగ్ కు “మనసానమః”, ఫస్ట్ తెలుగు షార్ట్ ఫిలిం ఇదే

విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన షార్ట్ ఫిలిం మనసానమః. ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. దీపక్ రెడ్డి దర్శకుడు. గతేడాది యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్ క్వాలిఫైలో ఉన్న మనసానమః కు ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది. ఈ ఓటింగ్ లోనూ గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు టీమ్ మెంబర్స్. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో యూనిట్ మాట్లాడారు.

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ…గతేడాది లాక్ డౌన్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేశాం. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో గౌతమ్ మీనన్ గారి ప్రెజెంట్స్ తో రిలీజ్ చేశారు. అలాగే కన్నడలో కేజీఎఫ్ కో ప్రొడ్యూసర్స్ మనసానమః విడుదల చేశారు. ఒక తెలుగు షార్ట్ ఫిలింకు ఇంటర్నేషనల్లీ 900 పైగా అవార్డ్స్ రావడం గర్వంగా ఉంది. ఆడియెన్స్ అందరికీ థాంక్స్ చెబుతున్నాం. ఆస్కార్ క్వాలిఫై ఓటింగ్ పై పాజిటివ్ గా ఉన్నాం. అన్నారు.

Related Posts