పూజాహెగ్డే వల్ల కాలేదు..రష్మిక వల్ల అవుతుందా..?

ఇప్పుడు హీరోలైనా హీరోయిన్లైనా.. కాస్త స్టార్డమ్ వస్తే చాలు.. ఆ స్టార్డమ్ ను మరింతగా విస్తరించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఒక భాషలోనే టాప్ ప్లేస్ లో ఉంటే.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ టాప్ లేపాలనుకుంటున్నారు. ఈ టాప్ పొజిషన్ కోసం ఏకంగా బాలీవుడ్ లోనూ బ్యాండ బజాయిస్తున్నారు. అలా సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో పాగా వేయాలనుకుంటున్న బ్యూటీ రష్మిక మందన్నా. ఆల్రెడీ నేషనల్ క్రష్ అనిపించుకున్న ఈ శ్రీవల్లి ఇప్పటికే మూడు హిందీ సినిమాలు చేస్తుంది. లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. టాలీవుడ్ మరో టాప్ హీరోయిన్ పూజాహెగ్డేకు బాలీవుడ్ డ్రీమ్స్ నెరవేరలేదు. మరి రష్మిక సాధిస్తుందా..?కన్నడ నుంచి ఛలోమంటూ తెలుగు తెరపై అడుగుపెట్టిన బ్యూటీ రష్మిక మందన్నా. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా ఒక్కో హిట్టూ ఎక్కుతూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అన్న ట్యాగ్ వరకూ వచ్చింది.

ఈ ట్యాగ్ నే ఎంట్రీ పాస్ గా చేసుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీ ఏకంగా అమితాబ్ బచ్చన్ తో నటించింది. గుడ్ బై అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను అనే ఓ స్పై థ్రిల్లర్ లో నటిస్తోందిప్పుడు. ఈ మూవీ కూడా షూటింగ్ చివరికి వచ్చింది. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ తెలుగులో అదే మూవీ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో ఫేమ్ అయిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్‌ బీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమాలోనూ రష్మికనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటు సౌత్ లో విజయ్ సరసన వారసుడు అనే బై లింగ్వుల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో సీతారామం లో కీలక పాత్ర చేస్తోంది. అలాగే పుష్ప సీక్వెల్ చేతిలో ఉంది.ఓ రకంగా రష్మిక మందన్నా ఇప్పుడు సౌత్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ బిజీగా ఉంది. తను కూడా అక్కడే ఉంటూ హిందీ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ చేతికి వచ్చింది. బాలీవుడ్ లో హార్డ్ వర్కింగ్ హీరోస్ కొందరున్నారు. ఆ కొందరిలో టైగర్ ష్రాఫ్‌ ఒకడు. తండ్రి వారసత్వంలో హీరోగా మారిన ఈ కుర్రాడి సరసనే రష్మిక హీరోయిన్ గా కొత్త సినిమాకు ఓకే చెప్పింది. శశాంక్ డైరెక్షన్ లో రానున్న సినిమా ఇది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట ఈ మూవీ. విశేష�