అదిరిపోయే ఆన్సర్ తో ఆకట్టుకున్న అడవి శేష్..

పదిమందిలో మాట్లాడుతున్నప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలంటారు. అలా ఉంటే అందరి మెప్పునూ పొందుతారు. కొందరు మాత్రం వేదికలపై మాట్లాడతున్నప్పుడు విచక్షణ మరిచిపోతారు. నవ్వుల పాలవుతారు. కానీ మీడియా ఎదురుగా ఉన్నప్పుడు మైండ్ ప్రెజెంట్ గా ఉంటే మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ చెప్పొచ్చు అని కూడా చాలామంది స్టార్స్ గతంలో ప్రూవ్ చేశారు. లేటెస్ట్ గా అడవి శేష్ కూడా అలాంటి ఆన్సర్ తోనే ముంబై మీడియాతో ‘‘క్యా బాత్ హై సాబ్’’ అనిపించుకున్నాడు. శేష్ నటించిన మేజర్ సినిమా వచ్చే నెల 3న విడుదల కాబోతోంది. 26/11 అటాక్స్ లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథగా వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. అందుకే సినిమాను తెలుగుతో పాటు హిందీ, మళయాలంలో కూడా విడుదల చేస్తున్నారు. మరి తమిళ్ ఎందుకు మిస్ చేసుకున్నారో కానీ.. ప్యాన్ ఇండియన్ రిలీజ్ గానే చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు శేష్. అయితే జూన్ 3న మేజర్ తో పాటు మరో రెండు మేజర్ మూవీస్ వస్తున్నాయి. తమిళ్ నుంచి కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత నటించిన మాస్ మూవీ విక్రమ్ వస్తోంది. హిందీ నుంచి అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ వస్తోంది. పృథ్విరాజ్ 12వ శతాబద్దంలో మొఘల్స్ ను ఎదురించిన మరాఠా వీరుడు పృథ్విరాజ్ చౌహాన్ కథగా వస్తోంది.

హిస్టారికల్ మూవీ కావడంతో అంచనాలున్నాయి.. ఇక ఈప్రమోషన్స్ లో శేష్ ను ముంబై మీడియా అడిగిన ప్రశ్న కూడా ఇదే.
ఈ మూడ సినిమాల మధ్య మీ సినిమా నిలుస్తుందా అని అడిగారు. దానికి అతను ‘‘ ప్రాక్టికల్ గా చూస్తే తెలుగు నుంచి మాది పెద్ద సినిమా.. తమిళ్ నుంచి విక్రమ్ పెద్ద సినిమా.. హిందీ నుంచి పృథ్విరాజ్ బిగ్ మూవీ అని ఆన్సర్ ఇస్తూనే.. సముద్రంలో ఎన్నో చేపలున్నా.. గోల్డ్ ఫిష్ పై ఎక్కువమంది దృష్టి ఉంటుంది కదా.. అలా మాది గోల్డ్ ఫిష్’’ అన్నాడు. ఈ ఆన్సర్ కు అక్కడి జర్నలిస్ట్ లంతా ఫిదా అయ్యారు. ఆ పక్కనే ఉన్న సినిమా హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆ ఆన్సర్ కు సర్ ప్రైజ్ అయిపోయింది. దీన్నే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు..