నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి కలెక్షన్స్ తో దూసుకెళుతున్నారు. బాలయ్య నెక్ట్స్ మూవీని క్రాక్ సినిమాతో సక్సస్ సాధించిన మలినేని గోపీచంద్ తో చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అది ఏంటంటే.. ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో సుదీప్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే… అర్జున్ విలన్ పాత్ర పోషిస్తున్నాడా..? లేక కీలక పాత్రా..? అతిధిగా పాత్రా..? అనేది తెలియాల్సివుంది. మరో విషయం ఏంటంటే.. ఈ మూవీలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తుంది.
అయితే.. మరో హీరోయిన్ కూడా ఉందట. ఆమె బోల్డ్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ అని టాక్ వినిపిస్తోంది. గతంలో లక్ష్మీ రాయ్ బాలయ్య సరసన ఓ సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి బాలయ్యతో నటించే ఛాన్స్ దక్కించుకుంది అంటున్నారు. అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సివుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారని సమాచారం. మరి.. అఖండతో బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య తదుపరి చిత్రంతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.