సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడం వలన కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయినట్టుగా మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ అయినట్టుగా పేర్కొన్నారు. తనతో కాంటాక్ట్ అయిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలాగే ఎవరైనా టీకా వేయించుకోకపోతే వెంటనే వెళ్లి టీకా వేయించుకోవాలి అన్నారు.
టీకా వలన ఆరోగ్య పరిస్థితి విషమించకుండా ఉంటుందని.. హాస్పటల్ చికిత్స అవసరం ఉండదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మహేష్ బాబు ప్రకటంచినప్పటి నుంచి సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు వెంటనే ఆయన కోలుకోవాలని.. కరోనా నుంచి బయటపడాలని కోరకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు.