రష్మిక చేతుల మీదుగా జర్నలిస్ట్ లకు కార్డ్ లు

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టిఎఫ్‌జేఏ) జర్నలిస్ట్ సంఘాల్లోనే ఓ ప్రత్యేకత కలిగిన సంఘం. స్వయంకృషితో ఎదుగుతూ.. ఇతర సంఘాల్లా కాకుండా ప్రతి సభ్యుడిని ఇంటి వ్యక్తిగా భావించి అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్న సంఘం టిఎఫ్‌జేఏ. స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ.. సభ్యులందరికీ మోరల్ సపోర్ట్ గా నిలుస్తోంది.

కోవిడ్ లాంటి ఆపద సమయాల్లో ప్రతి ఒక్కరినీ ఆదుకుంటూ అండగా నిలిచింది. దీంతో పాటు ఇప్పటి వరకూ ఏ జర్నలిస్ట్ సంఘం చేయనంతగా.. ఈ సంఘంలోని ప్రతి సభ్యుడి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ను ఏర్పాటు చేసింది. నలుగురు కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుంది.

అలాగే ప్రతి సభ్యుడికి టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంటల్ బెన్ఫిట్స్ తో కూడిని ఇన్సూరెన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో చేరిన ప్రతి సభ్యుడికీ ఇది వర్తిస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమం కోసం ఎన్నో సమస్యలను అధిగమిస్తూ.. పరిశ్రమ పెద్దల అండగాతో సంఘ సభ్యులందరికీ భరోసాగా నింపింది.

ఈ క్రమంలో ప్రతి యేడాది కార్డ్స్ అన్నీ రెన్యూవల్ చేస్తూ ఉంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కో సెలబ్రిటీ చేతుల మీదుగా సభ్యులకు గుర్తింపు కార్డులతో పాటు ఇన్సూరెన్స్ కు సంబంధించిన కార్డ్స్ ను అందిస్తుంటారు. గతేడాది మెగాస్టార్ చిరంజీవిగారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ యేడాది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేతలు మీదుగా అందరు సభ్యులకు కార్డ్స్ అందజేశారు.
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు నవీన్ యెర్నేని గారు, టిజి విశ్వ ప్రసాద్ గారు, సాహు గారపాటి గారు హాజరై సభ్యులకు కార్డ్స్ ను అందించారు. దీంతో పాటు వీరు టిఎఫ్‌జేఏ కు అన్ని విధాలుగా ఆర్థికంగా, హార్దికంగానూ సహాయ సహకారాలు అందించడం జరిగింది.

ఈ సందర్భంగా సంఘ సభ్యులందరూ వీరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు టిఎఫ్‌జేఏ తరఫున నిర్వహించడం జరుగుతుందని.. టిఎఫ్‌జేఏ అధ్యక్షుడు లక్ష్మీ నారాయ�