చివరికి నాగార్జున ఈ దర్శకుడి వద్ద ఆగాడా..?

కొన్నాళ్లుగా సక్సెస్ అనే మాటే వినలేకపోతున్నాడు కింగ్ నాగార్జున. తన తరం హీరోలంతా వరుస హిట్స్ తో దూసుకుపోతోంటే తను మాత్రం ఒక్క హిట్ కోసం నానా తంటాలూ పడుతున్నాడు. చివరగా బంగార్రాజుతో కమర్షియల్ గా ఫర్వాలేదు అనే హిట్ అందుకున్నాడు. బట్ అందులో మేజర్ షేర్ నాగ చైతన్యకే వెళ్లింది. ఇక త్వరలోనే తన వందవ సినిమాకు సిద్ధం అవుతున్నాడు నాగ్.

ఈ లోగా 99వ సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ మూవీ కోసమే కొన్నాళ్లుగా సరైన కథ, దర్శకుడి కోసం వెదుకుతున్నాడు. రీసెంట్ గా రైటర్ ప్రసన్నకుమార్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ సినిమా చేస్తాడు అనే మాటలు వినిపించాయి. అది నిజం కూడా. కానీ ఈ రైటర్ చెప్పిన కథ నాగ్ కు నచ్చలేదు. పైగా ఆ కథను అతను ఎలా డీల్ చేస్తాడో తెలియదు. అందుకే కథలో కొన్ని మార్పులు చేసి మరో మాస్ డైరెక్టర్ కు ఇవ్వాలనుకున్నారు. మరి ఏమైందో కానీ మొత్తంగానే ఈ మూవీ ఆగింది. ప్రసన్నకుమార్ మళ్లీ రవితేజ వద్దకు వెళ్లిపోయాడు.

ఓ దశలో నాగార్జున ఓ మళయాల మూవీని రీమేక్ చేద్దాం అని కూడా అనుకున్నాడు. అదీ వర్కవుట్ కాలేదు. ఇక లేటెస్ట్ గా ఓ సర్ ప్రైజింగ్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసి నెక్ట్స్ మూవీకే తేలిపోయిన అజయ్ భూపతితో నాగార్జున సినిమా చేయబోతున్నాడు అనేదే ఆ టాక్. టాక్ మాత్రమే కాదు. దాదాపు ఈ కాంబినేషన్ ఖాయం అయింది కూడా. నాగ చైతన్యతో కస్టడీ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస చిట్టూరితో కలిసి అన్నపూర్ణ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతోందట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందంటున్నారు.

ఇక అజయ్ భూపతి ప్రస్తుతం �