విడాకుల లాయర్ .. పవన్ కళ్యాణ్‌ అభిమానే

ఈ మధ్య కాలంలో మోస్ట్ ఎక్స్ పెక్టెడ్ డివోర్స్ అంటే నిహారిక, చైతన్యదే అని చెప్పాలి. 2020లో ఈ ఇద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. నాగబాబు కూతురుగా నిహారిక తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

అప్పటిక ఒక సినిమాలో హీరోయిన్ గా చేసింది. వెబ్ సిరీస్ లో నటించింది. అయితే చైతన్య జొన్నలగడ్డతో తను ప్రేమలో పడ్డానని, పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు ఈ జంట హ్యాపీగానే ఉంది.

అయితే గతేడాది ఓ పబ్ లో జరిగిన రైడ్స్ లో డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. అందులో నిహారిక పేరు కూడా వినిపించింది. తను డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది.. ఆ కేస్ లో తను లేదు అనేది కూడా క్లియర్ గా ఎవరికీ తెలియదు. పోలీస్ లు కూడా తన పేరు ఉందని చెప్పలేదు.

అప్పటి నుంచే వీరి మధ్య మనస్ఫర్థలు మొదలయ్యాయి అంటారు. ఆ తర్వాత కొంతకాలం కామ్ గానే ఉన్నా.. ఈ యేడాది ఆరంభంలో ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ”అన్ ఫ్రెండ్” చేసుకున్నారు. ఫోటోస్ డిలీట్ చేసుకున్నారు.

ఆల్రెడీ ఇది సమంత విషయంలో జనాలకు అనుభవంలో ఉంది కాబట్టి.. ఇక వీరు కూడా విడిపోతున్నారు అనే భావించారు. అనుకున్నట్టుగానే ఈ మంగళవారం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్ట్ వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ విడాకులు వెనుక కీలకంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్‌ అభిమాని.. జనసేన కార్యకర్త.. లాయర్ దిలప్ కుమార్ సుంకర కావడం విశేషం.


పవన్ కళ్యాణ్‌ అభిమానిగా జనాలకు పరిచయం