మరో సీనియర్ బ్యూటీతో సిద్ధు జొన్నలగడ్డ

‘డిజె టిల్లు’తో బడా హిట్ అందుకుని.. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలితో దూసుకుపోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ‘డిజె టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత నీరజ కోన డైరెక్షన్ లో ‘తెలుసు కదా’ సినిమా ఉంది. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీస్ తో పాటు నందిని రెడ్డి డైరెక్షన్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సిద్ధు.

సిద్ధు జొన్నలగడ్డ, నందిని రెడ్డి మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందట. టాలీవుడ్ లో ఎ టు జెడ్ స్టార్ హీరోస్ అందరితోనూ అలరించిన పూజాకి ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు. బాలీవుడ్ పై ఫోస్ పెట్టి.. టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ వదులుకుంది. ఇక.. లేటుగానైనా తన తప్పు తెలుసుకున్న అమ్మడు మళ్లీ తెలుగులో బిజీ అవ్వడానికి ట్రై చేస్తుందట. ఈ కోవలోనే సిద్ధుతో సినిమాకి ఓ.కె. చెప్పిందట. మొత్తంమీద.. సీనియర్ బ్యూటీస్ రాశీ ఖన్నాతో పాటు.. పూజా హెగ్డేతోనూ జోడీ కట్టబోతున్నాడు మన టిల్లు బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.

Related Posts