నట్టికుమార్ ను పట్టించుకుంటారా..

సీనియర్ నిర్మాతగా నట్టికుమార్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు. తీసేవన్నీ చిన్న సినిమాలే. అయినా ఓ పెద్దరికం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ మేరకు ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు. ప్రస్తుతం కొన్నాళ్లుగా ఆయన తీరు చూస్తే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్టు అర్థం అవుతుంది. అలాంటి నట్టి కుమార్ సడెన్ గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. పైగా తను అనారోగ్యంతో ఉన్నానని.. అయినా చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం చూసి బాధపడుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టాను అన్నాడు.

ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సినిమా పరిశ్రమతో చాలా దగ్గర సంబంధాలు నెరిపాడు. ఇండస్ట్రీలోని చాలామందిఆర్టిస్టులను తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వాడుకున్నాడు. కొందరికి పదవులు ఇచ్చాడు. ఇంకొందరికి ఎమ్మెల్యే సీట్స్ ఆఫర్ చేశాడు. బాబూమోహన్ లాంటి వాళ్లు మినిస్టర్స్ కూడా అయ్యారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడటం లేదంటూ ఘాటుగా స్పందించాడు నట్టి కుమార్.


తాను తెలుగుదేశం పార్టీకి బద్ద వ్యతిరేకి అయినా.. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం నచ్చలేదు అన్నాడు. అలాంటిది.. మాట్లాడితే మా ఎన్టీఆర్ అని చెప్పుకునే వైవిఎస్ చౌదరి, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమర్ లాంటి వాళ్లు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించాడు. అల్లు రామలింగయ్య చనిపోతే ఆ రోజంతా చంద్రబాబు ఉన్నాడని గుర్తు చేశాడు. దీనర్థం అరవింద్ స్పందించలేదనే కదా. ఇక ఎన్టీఆర్ పై కూడా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు తను ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం వల్ల మిగతా వాళ్లు కూడా ముందుకు వచ్చి సానుభూతి వ్యక్తం చేస్తూ మాట్లాడతారని ఆశిస్తు�