NTR : ఎన్టీఆర్ భయపడ్డాడా.. ?

జూనియర్ ఎన్టీఆర్ భయపడ్డాడా..? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు, ఎవరికి అనేది ఇక్కడ చూద్దాం. ఎన్టీఆర్, నందమూరి కుటుంబం మధ్య ఈ మధ్య కాలంలో కాస్త దూరం పెరిగింది అనేది వాస్తవం. ఎవరు కాదు అన్నా.. అదే నిజం అని ఇంతకు ముందు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపు సభతో తేలిపోయింది. ఈ కార్యక్రమానికి జూనియర్ కు ఆహ్వానం ఉంది. అయినా వెళ్లలేదు అని చాలా కొద్దిమందికే తెలుసు.

ఎందుకూ అనేదానికి కూడా సమాధానాలు చాలానే ఉన్నాయి. ఇక పెద్దాయన శతజయంతి ఉత్సవాల ముగింపు సభ హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తున్నారు. దీనికి అతనికి ఆహ్వానం అందింది. తను వెళుతున్నాడు కూడా. కానీ ప్రేమతో కాదు. భయంతో అంటున్నారు విశ్లేషకులు.


ఒకప్పుడు తాతగారి పేరు లేకుండా మాట్లాడే వాడు కాదు జూనియర్. చాలాకాలం క్రితమే తన స్పీచుల్లో తాతగారు మిస్ అయ్యారు. మరి ఇప్పుడు హైదరాబాద్ సభకు ఎందుకు వెళుతున్నారు అంటే.. ఈ సభకు తనతో పాటు అతనికంటే పెద్ద స్టార్స్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ లు కూడా వస్తున్నారు కాబట్టి. వీరిలో ముగ్గురు హీరోలు ప్యాన్ ఇండియన్ స్టార్స్ కూడా. వీళ్లే వస్తున్నప్పుడు తను వెళ్లకపోతే అది తన అభిమానుల్లోనే కాక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ పాత అనుమానాలను బలపరుస్తూ కొత్త సమీకరణాలకు కారణం అవుతుంది.

అంటే అది తన ఇమేజ్ పై ప్రభావం చూపుతుంది. ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్డమ్ తో పాటు నంబరింగ్ కూడా కీలకంగానే ఉంటుంది. అంటే టాప్ త్రీ, టాప్ ఫైవ్ ఇలా.. ఈ రెండు కేటగిరీస్ లో ఉండేవారే తోప్ అనిపించుకుంటారు. కానీ ఇప్పుడీ రెండు కేటగిరీస్ లోనూ ఎన్టీఆర్ లేడు. టాప్ సిక్స్ లో ఉన్నాడు తారక