సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందనుందని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. దాదాపుగా 11 ఏళ్ల నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టుగా స్వయంగా రాజమౌళి ప్రకటించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ తో సినిమా గురించి మాట్లాడారు.
ఎన్టీఆర్, చరణ్ లతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి ప్రస్తావించారు. నేను మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాను. అయితే.. ఎలాంటి సినిమా చేయాలనే దాని పై ఇప్పటికే మా నాన్నతో డిస్కష్ చేసాను. ఆయన కొన్ని ఐడియాస్ అనుకున్నారు. కాకపోతే వాటి మీద డీఫ్ గా ఇంకా ఆలోచించలేదు. ఇది ఖచ్చితంగా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్. దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రాజమౌళి తెలిపారు.
రాజమౌళి.. మహేష్ సినిమా గురించి చెబుతున్నప్పుడు ఎన్టీఆర్ కలుగజేసుకొని మహేష్, రాజమౌళి సినిమా గురించి ఖచ్చితమైన సమాచారం తనకు తెలుసని.. ఈ సినిమా 2026లో రిలీజ్ అవుతుందని చెప్పి నవ్వులు పూయించారు. ఎన్టీఆర్ అలా చెప్పడంతో రాజమౌళి నో వే అని అన్నారు. వెంటనే.. ఎన్టీఆర్ అందుకొని.. డిస్కషన్స్ జరిగి షూటింగ్ మొదలవ్వడానికి 2023 పడుతుందని.. కరోనా పాండమిక్ వంటి ఇబ్బందులు లేకపోతే 2025కి వస్తుందని సరదాగా చెప్పారు. మహేష్, రాజమౌళి మూవీ గురించి ఎన్టీఆర్ చెప్పిన ఈ జోష్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.