మైఖేల్ రివ్యూ

రివ్యూ : మైఖేల్
తారాగణం : సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు.
సంగీతం : శ్యామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ : కిరణ్‌ కౌశిక్
నిర్మాతలు : భరత్ చౌదరి, రామ్మోహనరావు పుష్కర్
దర్శకత్వం : రంజిత్ జెయకోడి.

అన్ని పరిశ్రమల్లోనూ అండర్ రేటెడ్ ఆర్టిస్టులుంటారు. కొన్ని పరిశ్రమల్లోనే అండర్ రేటెడ్ హీరోలుంటారు. తెలుగులో అలాంటి కుర్రాడు సందీప్ కిషన్. చాలాకాలంగా పరిశ్రమలో ఉన్నా.. సరైన హిట్ లేక ఇంకా చాలా వెనకబడిపోయే ఉన్నాడు. ఇన్నేళ్ల కెరీర్ లోనే వేళ్లమీద లెక్కించే అన్ని విజయాలు మాత్రమే ఉన్న సందీప్ కిషన్ ఇప్పుడు మైఖేల్ గా వచ్చాడు. ఇది అతనికి ఫస్ట్ ప్యాన్ ఇండియన్ సినిమా. ప్రస్తుతం దేశంలో ఉన్న ట్రెండ్ కు తగ్గట్టుగా గ్యాంగ్ స్టర్ కథతో వచ్చాడు. మరి ఈ గ్యాంగ్ స్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడా లేదా అనేది చూద్దాం.

గురునాథ్(గౌతమ్ మీనన్) ఓ పెద్ద గ్యాంగ్ స్టర్. ఓ సారి అతనిపై ఎటాక్ జరిగితే పదేళ్ల మైఖేల్(సందీప్ కిషన్) కాపాడతాడు. అప్పటి నుంచీ మైఖేల్ ను తన వద్దే ఉంచుకుంటాడు గురునాథ్ అలియాస్ గురు. గురు గ్యాంగ్ లో అత్యంత కీలకమైన మెంబర్ గా ఎదుగుతాడు మైఖేల్. దీంతో గురు తనయుడు అమర్ నాథ్( వరుణ్ సందేష్) ఈర్ష్యగా ఫీలవుతుంటాడు. అయినా గురు పూర్తిగా మైఖేల్ ను మాత్రమే నమ్ముతాడు. అలాంటి గురుపై మరోసారి ఎటాక్ జరుగుతుంది. అది చేసింది ఎవరో తెలుసుకుని.. అతనితో పాటు అతని కూతురును కూడా చంపేయమని మైఖేల్ ను ఢిల్లీకి పంపిస్తాడు గురు. ఢిల్లీ వెళ్లిన మైఖేల్ తను చంపాల్సిన అమ్మాయి పేరు తీర(దివ్యాంశ కౌశిక్) అని తెలుసుకుంటాడు. ఆమెను కలుసుకునేందుకు వెళ్లి ప్రేమలో పడతాడు. మరోవైపు ఆమె తండ్రినీ చంపాలని ప్రయత్నించినా విరమించుకుంటాడు. బట్ ఓ రోజు ఓ పెద్ద గ్యాంగ్ వచ్చి మైఖేల్ ను కొట్టి తీరను కిడ్నాప్ చేస్తారు. తీరను వెదుక్కుంటూ వెళ్లిన మైఖేల్ ను చంపేస్తారు. అది ఇంటర్వెల్ బ్యాంగ్. తర్వాతేం జరుగుతుందో సగటు ప్రేక్షకులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. అయితే మైఖేల్ ను చంపిన వాళ్లెవరు..? తీర ఎవరు..? అసలు మైఖేల్ లక్ష్యం ఏంటీ..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి..
మైఖేల్ లాంటి కథలు తెలుగు తెరపైనే �