ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు ఏమైంది..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా గురించి ఎప్పటి నుంచో చూస్తున్నారు. సలార్ కంటే ముందే వీరి కాంబోలో సినిమా వస్తుందనుకున్నారు. బట్ సడెన్ గా సలార్ స్టార్ట్ అయింది. దీంతో నెక్ట్స్ ఇక ఎన్టీఆర్ తోనే అనుకున్నారు. బట్ అలా జరగడం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమాలో నటిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ఈ యేడాది నవంబర్ కు అయిపోతుంది. తర్వాత బాలీవుడ్ లో కమిట్ అయిన వార్ 2 షూటింగ్ కు వెళతాడు యంగ్ టైగర్. అయితే వార్2 తో పాటు కాస్త అటూ ఇటూగా .. ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయా మధ్య. బట్ అది నిజం కాదట. ఈ చిత్రం 2024 చివర్ లో స్టార్ట్ అవుతుందంటున్నారు.

అంటే రిలీజ్ అయ్యేది 2025లో అన్నమాట. మరి ఇలా ఎందుకు జరుగుతోంది.. అసలు ఈ కాంబోలో సినిమా ఉంటుందా ఉండదా అనే చర్చలు తెలుగులోనే కాదు.. కన్నడ నాట కూడా జరుగుతుండటం విశేషం.
ఎన్టీఆర్ కు తెలుగుతో పాటు కన్నడలో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఈ కాంబోలో సినిమా కోసం వారు కూడా చూస్తున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కమిట్మెంట్స్ చూస్తే సలార్ మీదే ఉన్నాయట. ఈ యేడాది సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 విడుదలవుతుంది. అయితే ఇదే చిత్రానికి పార్ట్ 2ను కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్. ఇప్పటికే షూటింగ్ మాగ్జిమం పూర్తయింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ లో ట్రైలర్ వస్తుంది.

ఆ తర్వాత ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ప్రమోషన్స్ ఉంటాయి. రిలీజ్ తర్వాత కూడా కొంత హడావిడీ ఉంటుంది. అది తగ్గిన తర్వాత ఎన్టీఆర్ సినిమా అనేది ప్లాన్. బట్ ఈ ప్లానింగ్ లో మార్పులు వచ్చాయి. సలార్ సెకండ్ పార్ట్ 2024 సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు కాబట్ట