వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ స్టార్ట్

వైవిధ్యమైన కథలతో మెగా హీరోల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. క్లాస్ తో పాటు మాస్ ను కూడా మెప్పిస్తూ జర్నీ చేస్తున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోన్న వరుణ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాతో రాబోతున్నాడు.

ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే ఇదో స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ప్రవీణ్‌ సత్తారు మూవీస్ అంటే ఇలాగే ఉంటాయి. అయితే వరుణ్‌ ఇందులో రా ఏజెంట్ గా నటించాడు అనే టాక్ కూడా ఉంది. అతని సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ కు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వరుణ్‌.


పలాస 1979 మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ లోకి వచ్చిన కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతోంది. ఈ నెల 27న అఫీషియల్ గా ప్రారంభం అవుతుంది. అదే రోజు ఇతర కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన అప్డేట్స్ చెబుతారు అంటున్నారు. కరుణ కుమార్ ఫస్ట్ మూవీతో మెప్పించాడు కానీ.. తర్వాత చేసిన శ్రీదేవి సోడా సెంటర్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత చేసిన మినీ బడ్జెట్ మూవీ కళాపురం కూడా పోయింది. అయినా ఓ మంచి బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న కథతో మెగా క్యాంప్ లోకి ఎంటర్ కావడమే కాదు.. వరుణ్‌ లాంటి ప్రామిసింగ్ హీరోను మెప్పించాడు. ఇదో పీరియాడిక్ స్టోరీ అంటున్నారు. అలాంటి నేపథ్యంలోనే వచ్చిన పలాస బ్లాక్ బస్టర్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో కానీ.. ఇది కరుణకుమార్ కు మంచి అవకాశం అనే చెప్పాలి.