ఈ వారం ఓటీటీ లలో సినిమాల సందడి

ఈ వారం థియేటర్లలో రావాల్సిన ‘ప్రతినిధి 2’ వాయిదా పడడంతో.. విశాల్ ‘రత్నం’కి పోటీ లేకుండా పోయింది. బాక్సాఫీస్ వద్ద ‘రత్నం’ సింగిల్ గా థియేటర్లలోకి దిగుతోంది. మరోవైపు.. ఓటీటీ లలో మాత్రం సినిమాల సందడి జోరుగా ఉంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 25, 26 లలో కొన్ని క్రేజీ తెలుగు మూవీస్ ఓటీటీ లలో సందడి చేస్తున్నాయి.

Pratinidhi 2 (2024) - IMDb

గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భీమా’ ఈరోజు (ఏప్రిల్ 25) నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వేదికగా ‘భీమా’ స్ట్రీమ్ అవుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా ప్రియ భవానీ శంకర్, మాళవిక