బేబీకి బొకే పంపింది అందుకేనా రామ్

బేబీతో ఓవర్ నైట్ ఫేమ్ అయింది వైష్ణవి చైతన్య. అంతకు ముందు యూ ట్యూబ్స్ లో ఎన్ని వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు చేసినా తనకు అంత గుర్తింపు ఉండేది కాదు. బేబీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆ మాటకు వస్తే తెలుగువాళ్లందరికీ తెలిసిపోయింది. ఇండస్ట్రీలో కూడా తను హాట్ టాపిక్ గా మారింది.

ఓ తెలుగు అమ్మాయి ఇలాంటి పాత్ర చేయడం సాహసమే. అయినా గ్లామర్ ఫీల్డ్ లో మడికట్టుకుని కూర్చుంటే కష్టం. అదీ కాక చేసేది పాత్ర మాత్రమే. అందుకే తను ధైర్యం చేసింది. అందుకు ఫలితం వచ్చింది. ఇప్పుడు తనకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.అయితే ఎస్కేఎన్ తో మరో రెండు సినిమాలు చేయాలనే ఒప్పందం ఉందీ అనే టాక్ ఉంది. దానికి మించిన న్యూస్ ఒకటి ఇప్పుడు వినిపిస్తోంది.


వైష్ణవి చైతన్యకు పూరీ జగన్నాథ్ ఆఫర్ ఇచ్చాడు అనేదే ఆ టాక్. యస్.. రామ్ పోతినేనితో చేస్తోన్న డబుల్ ఇస్మార్ట్ లో అమ్మడికి అవకాశం ఇచ్చారంటున్నారు. అందుకే ఇంతకు ముందు రామ్ ఆమెకు ఓ బొకే పంపించి బేబీ సక్సెస్ పై శుభాకాంక్షలు చెప్పాడు. మామూలుగా ఇలాంటివి నచ్చితే ఓ ట్వీట్ చేస్తే సరిపోతుంది. లేదా అఫీషియల్ గా కంగ్రాట్స్ అనేస్తారు.

బట్ రామ్ ఏకంగా బొకే పంపించి మరీ విషెస్ చెప్పాడు అంటే అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. బట్ అందులోని పరమార్థం ఇదే అంటున్నారు. బేబీ చూసిన తర్వాతే తనను తమ సినిమాలో తీసుకోవాలని పూరీ జగన్నాథ్, ఛార్మీ ఫిక్స్ అయ్యారట. ఆ విషయం రామ్ కు తెలియకుండా ఉండదు కదా.. అందుకే అమ్మడు ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడం.. నెక్ట్స్ మూవీకే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ఆఫర్ అందుకోవడం వల్లే రామ్ బొకే పంపించాడు అంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్ తరహా రెబల్ రోల్ కు వైష్ణవి �