చరణ్ కు షాక్ ఇచ్చిన శంకర్

ఆర్ఆర్ఆర్ తర్వాత సౌత్ నుంచి స్టార్ట్ అయిన క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ అంటే రామ్ చరణ్‌ – శంకర్ అనే చెప్పుకున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్‌ కు మరో బిగ్గెస్ట ప్యాన్ ఇండియన్ సినిమా అవుతుందనుకున్నారు.

అదే స్థాయిలో భారీ బడ్జెట్ తో మొదలుపెట్టారు కూడా. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ వాళ్లు షాక్ ఇచ్చారు. శంకర్ అంతకు ముందే కమల్ హాసన్ తో భారతీయుడు2 చిత్రాన్ని ప్రారంభించాడు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆపేశాడు. దీంతో ఆ నిర్మాణ సంస్థ కోర్ట్ కు వెళ్లింది. కోర్ట్ లో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో శంకర్ కు భారతీయుడు2 పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా రెండు సినిమాల షెడ్యూల్స్ ను బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళతా అని కొన్నాళ్లు ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. ఇక పూర్తిగా కమల్ హాసన్ సినిమాకే టైమ్ కేటాయించాడు. అప్పటికే ఈ చిత్రానికి ”గేమ్ ఛేంజర్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.


భారతీయుడు 2ను పూర్తి చేసిన తర్వాత వెంటనే గేమ్ ఛేంజర్ స్టార్ట్ చేసి సమ్మర్ లో విడుదల చేయలన్న ప్లానింగ్ లో ఉన్నాడు శంకర్. చూస్తోంటే అది అసాధ్యం అనిపించేలానే ఉంది. ఎందుకంటే తాజాగా భారతీయుడు2నే సమ్మర్ కు విడుదల చేయబోతున్నట్టు చెబుతున్నారు.

అంటే కనీసం ఫిబ్రవరి వరకూ శంకర్ కు ఈ మూవీతోనే సరిపోతుంది. అప్పుడు రామ్ చరణ్‌ మూవీ స్టార్ట్ చేస్తే సమ్మర్ కు కాదు కదా.. 2024 దసరాకు కూడా విడుదల చేయడం కుదరదు. మరి అప్పటి వరకూ చరణ్‌ ఆగుతాడా అంటే చెప్పలేం. ఇప్పటికే అతను బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయడానికి ఓకే చెప్పి ఉన్నాడు. బట్ ఈ మూవీ గురించి కూడా ఒక్క అప్డేట్ లేదు.