దృశ్యం 3 కూడా వస్తోంది..

2013లో మళయాలంలో వచ్చిన దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ చిత్రం మాలీవుడ్ కు ఫస్ట్ వంద కోట్లు తెచ్చిన సినిమా కావడం విశేషం. అప్పటి వరకూ మాలీవుడ్ ఇంత స్పాన్ ను ఊహించలేదు. ఎప్పుడూ చూడలేదు కూడా. ఈ మూవీ తర్వాత వారి మార్కెట్ కూడా విస్తరించిందంటే అతిశయోక్తి కాదు. జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ఆశ్చర్యంగా రీమేక్ అయిన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ అయింది.

ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా దృశ్యం 2 కూడా చేశాడు జీతూ జోసెఫ్. ఫస్ట్ పార్ట్ కు ఏ మాత్రం తగ్గకుండా ఆడియన్స్ ను థ్రిల్ చేసి మరోసారి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగులో వెంకటేష్ ఈ రెండు భాగాల్లో కనిపించాడు. ఫస్ట్ పార్ట్ ను మాజీ హీరోయిన్ సుప్రియ డైరెక్ట్ చేసింది.

సెకండ్ పార్ట్ ను జీతూ జోసెఫే తెలుగులోనూ చేశాడు. ఫస్ట్ పార్ట్ లో మర్డర్ మిస్టరీని సెకండ్ పార్ట్ లో క్లియర్ చేశారు. దీంతో కోర్ట్ విధించలేపోయిన శిక్ష కంటే దాన్ని తప్పించుకుని నిరంతరం రాంబాబు నరకం అనుభవిస్తుంటాడు. అంతకంటే అతనికి పెద్ద శిక్ష అక్కర్లేదు అనే డైలాగ్ తో సెకండ్ పార్ట్ ముగిసిపోతుంది. దీంతో ఇక దృశ్యం కథలు కూడా అయిపోయినట్టే అనుకున్నారు. బట్ జీనియస్ అయిన జీతూ జోసెఫ్ మరో పార్ట్ కు రంగం సిద్ధం చేసుకున్నాడు.


త్వరలోనే దృశ్యం 3 కూడా రాబోతోంది. ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. అయితే ఈ సారి హిందీలో కూడా తనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈమేరకు మోహన్ లాల్ తో పాటు అజయ్ దేవ్ గణ్‌ కూడా తమ అంగీకారం తెలిపారు. 2024లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటూ రెండు భాషల్లోనూ ఒకేసారి షూటింగ్ చేస్తూ.. రిలీజ్ డేట్ ను కూడా ఒకే రోజుల ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారట. దృశ్యంకు సీక్వ�