శర్వానంద్ కి జోడీగా సాక్షి వైద్య

అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది మరాఠీ బ్యూటీ సాక్షి వైద్య. మహారాష్ట్రలోని ఠాణెలో జన్మించిన సాక్షి చదువు పూర్తికాగానే ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది. తొలుత పలు టి.వి. ప్రచార చిత్రాల్లో నటించింది. మోడల్ గా మంచి పాపులారిటీ సంపాదించిన సాక్షిని ‘ఏజెంట్’ కోసం ఏరికోరి తీసుకున్నారు.

‘ఏజెంట్’తో మంచి హిట్ అందుకుందామనుకున్న సాక్షి ఆశలు అడియాసలయ్యాయి. ఆ తర్వాత వెంటనే వరుణ్ తేజ్ కి జోడీగా ‘గాండీవధారి అర్జున’ చేసింది. ఇది కూడా ఆమెకు విజయాన్నందించలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో మురిపించడానికి రెడీ అవుతోంది సాక్షి వైద్య.

శర్వానంద్ తో ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీలో నిత్య పాత్రలో మెరవనుంది సాక్షి. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్ లో 37వ సినిమా. రామ్ అబ్బరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. మరి.. శర్వా అయిన సాక్షికి హిట్ ఇస్తాడేమో చూడాలి.

Related Posts