క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తోన్న రవితేజ

మాస్ మహారాజ రవితేజాతో మలినేని గోపీచంద్ చేయాల్సిన ప్రాజెక్ట్ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కి వెళ్లింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవలే ముహూర్తాన్ని జరుపుకుంది. రవితేజ మూవీ బాలీవుడ్ హీరోకి వెళ్లినట్టే.. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కోసం అనుకున్న ప్రాజెక్ట్ రవితేజ చెంతకు చేరిందట.

‘హనుమాన్’తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ లో రణ్‌వీర్ సింగ్ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నాడు. ఆ చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే.. హీరో రణ్‌వీర్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ కోసం అనుకున్న సినిమాని రవితేజాతో చేయబోతున్నాడట ప్రశాంత్ వర్మ. త్వరలోనే.. ఈ మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

Related Posts