సమంత ప్లేస్ లో రష్మిక మందన్నా

ఈ మధ్య టాలీవుడ్ లో మహిళా దర్శకులు బాగా పెరుగుతున్నారు. సక్సెస్ సంగతి పక్కన బెడితే ముందు వారికి అవకాశాలు ఇస్తున్నారు నిర్మాతలు. అంతవరకూ చాలా హ్యాపీ అనే చెప్పాలి. వారు చెప్పే కథల్లో కొన్ని సెన్సిబిలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఓ పర్ఫెక్షన్ కూడా కనిపిస్తుంది. కాకపోతే వీరికి విజయాలు కూడా వస్తే మరింతమందికి ఇన్సిస్పిరేషన్ అవుతారు.

ఇక లేటెస్ట్ గా డైరెక్షన్ లోకి ఎంటర్ అవుతోంది నీరజ కోన. మొన్నటి వరకూ టాప్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న నీరజ త్వరలోనే దర్శకురాలుగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ కథలో హీరోగా డిజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఓకే అన్నాడు.

రొమాంటిక్ జానర్ లో రాబోతోన్న మూవీ ఇది. ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు.నీరజ, సమంత మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం కోసం ఆమె ఓకే చెబుతుందీ అనుకున్నారు. బట్ తను సినిమాలకు యేడాది పాటు లాంగ్ లీవ్ ప్రకటించింది. తన హెల్త్ ను సెట్ చేసుకునేందుకు విదేశాల్లో విహరిస్తోంది.


ఇక సమంత ప్లేస్ లో మరో టాప్ హీరోయిన్ రష్మిక మందన్నాను తీసుకోవాలనుకుంటోందట నీరజ. ఈ మేరకు రష్మికు అప్రోచ్ అయినట్టు సమాచారం. ఇంకా తను ఓకే చెప్పలేదు. కానీ ఈ కథను కాదనే చాన్స్ లేదంటున్నారు. ఓ మంచి కథ సెట్ అయిందనే టాక్ ఇండస్ట్రీలో కూడా వినిపిస్తోంది. మరి ఆ స్టోరీని నీరజా కోన ఎలా హ్యాండిల్ చేస్తుందో కానీ.. సరిగ్గా చేయగలిగితే ఓ మంచి సినిమా అవుతుందంటున్నారు. అందుకే తను ఏకంగా టాప్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ను తీసుకుంది.

ఇలాంటి కథలను ఆయన కవిత్వీకరిస్తాడు. విజువల్ ట్రీట్ అవుతుంది. ఇక మ్యూజిక్ తమన్ చేస్తున్నాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇంత పెద్ద టెక్నికల్ సపోర్ట్ ఉంది కాబట్టి రష్మిక కూడా సిద్ధుతో రొమాన్స్ క