రామ్ – పూరీ జగన్నాథ్.. దూకుడు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా టైమ్ కు ఇద్దరూ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ బ్లాక్ బస్టర్ ఇద్దరికీ సరికొత్త హోప్ ఇచ్చింది. బట్ తర్వాత మళ్లీ ఇద్దరూ గాడి తప్పారు. రామ్ .. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్, ది వారియర్ రెండూ పోయాయి. పూరీ జగన్నాథ్ లైగర్ తో డిజాస్టర్ చూశాడు.

లైగర్ తర్వాత పూరీ జగన్నాథ్ కు మరో హీరో దొరకలేదు. కొందరిని ట్రై చేశాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు. చివరగా మెగాస్టార్ చిరంజీవితో కూడా ట్రై చేశాడు. అయితే చిరంజీవి మాత్రం ఛార్మీని వదలాలని.. అదే వారి సొంత నిర్మాణ సంస్థలో కాకుండా వేరే నిర్మాణ సంస్థ అయితే చేస్తా అని చెప్పాడట. కానీ సొంత ప్రొడక్షన్ హౌస్ లో మాత్రమే చేస్తానని పూరీ జగన్నాథ్ చెప్పడంతో మెగాస్టార్ నో అనేశాడు. అంతకు ముందే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ 2 చేస్తానని చెప్పి ఉన్నాడు. సో.. ఇక మళ్లీ అతన్నే ఒప్పించాడు.


రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో స్కంద మూవీ చేసి ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ కుమంచి స్పందన వచ్చింది. ఇక డబుల్ ఇస్మార్ట్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందబోతోన్న ఈమూవీకి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. పూరీ జగన్నాథ్ అంటే జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తుంటాడు కదా.. ఈ సినిమాకు కూడా అదే అప్లై చేయబోతున్నాడు. ఈ సినిమాను ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. 12 నుంచి వెంటనే రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతున్నారు. అంటే ఓపెనింగ్ కు షూటింగ్ కు మధ్య పెద్దగా గ్యాప్ లేదన్నమాట.


అయితే రామ్ .. స్కంద మూవీ కోసం కాస్త ఫిజిక్ పెంచాడు. ఆ ఫిజిక్ తోనే