ప్రాజెక్ట్ కే కోసం కమల్

ప్రభాస్ హీరోగా ” వైజయంతి బ్యానర్” లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ”ప్రాజెక్ట్ కే”. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటి వరకూ తెలుగు తెరపై రానటువంటి కంటెంట్ తో హాలీవుడ్ ను కూడా మించి అనేలా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఇది నాగ్ అశ్విన్ కు మూడో చిత్రం మాత్రమే. అయినా అతను ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ను గ్లోబల్ స్టార్ గా మార్చే పెద్ద బాధ్యత తీసుకున్నాడు.

ఇక ఈ మూవీలో విలన్ గా నటించేది ఎవరు అనే ప్రశ్న చాలాకాలంగా వినిపిస్తున్నదే. ఎవెంజర్స్ లో థానోస్ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అలాంటి వారికి అంతకు మించి అనేలా లోక నాయకుడు కమల్ హాసన్ ను ఒప్పించారు అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి కమల్ ను తీసుకుంటున్నారు అనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తున్నది. అయితే ఫైనల్ గా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనేది లేటెస్ట్ టాక్.
ఈ ప్రాజెక్ట్ కోసం కమల్ హాసన్ 30 రోజులు డేట్స్ ఇచ్చాడట. ఈ 30 రోజులకు ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఓకే చెప్పాడంటున్నారు.

ఇక కమల్ హాసన్ ఎంట్రీతో ప్రాజెక్ట్ కే రూపమే మారిపోతుందని చెప్పొచ్చు. కమల్ కు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్ ఇప్పుడు క్రేజీయొస్ట్ స్టార్. అలాంటి వీరి కాంబోలో సినిమా అంటే ఖచ్చితంగా ఇండియన్ సినిమా లుక్కే మారిపోతుంది అనుకోవచ్చు. టైమ్ ట్రావెల్ లేదా టైమ్ మెషీన్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ థ