పరశురామ్ పైసలు కట్టిండు.. ఇంక విజయ్ సినిమా ఆగదు

కొన్నాళ్లుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నాడు పరశురామ్. తను కొంతమంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు తీసుకున్నాడు. కానీ వారికి సినిమా చేయకుండా మధ్యలో వచ్చిన దిల్ రాజుతో మూవీకి ఓకే చెప్పాడు. ఈ విషయంలో అతనిపై చాలామంది హాట్ హాట్ కమెంట్స్ కూడా చేశారు. ఇంక పరశురామ్ కెరీర్ ప్రమాదంలో పడినట్టే అనుకున్నారు కూడా.

మరోవైపు దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా ప్రశ్నార్థకంలో పడింది. ఈ క్రమంలో అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు మాకు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వ్యవహారాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో పెట్టారు. ఆ మొత్తం కట్టడం దాదాపు సాధ్యం కాదు అని చాలామంది భావించారు. బట్ పరశురామ్ వడ్డీతో సహా చెల్లించాడు. ఇప్పటి వరకూ తనపై వచ్చిన విమర్శలను వడ్డీతో సహా తిప్పి కట్టాడు.


పరశురామ్ కట్టాల్సిన మొత్తం బాకీ 14.5 కోట్లు. విశేషం ఏంటంటే.. ఇందులో 6 కోట్లు అసలు అయితే 7 కోట్లు వడ్డీ అయింది. ఇండస్ట్రీలో నడిచేది ధర్మవడ్డీ కదా.. ఇలాగే ఉంటుంది. ఇక మరో కోటిన్నర నాగ చైతన్య సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ ఉంది. ఈ మొత్తాన్ని దిల్ రాజు తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ నుంచి కట్టాడు. అంటే పరశురామ్ రెమ్యూనరేషన్ 14న్నర కోట్లా అనుకోకండి. అంత కాదు. కానీ అతనికి మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ దిల్ రాజు ఇచ్చాడు. మిగతాది తన సొంతం నుంచి కట్టాడు పరశురామ్.

అంటే ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో పెట్టడం వల్ల ఇచ్చాడా లేక.. నిజంగానే పౌరుషానికి పోయి ఇచ్చాడా అనేది తర్వాతి సంగతి. కానీ ఇకపై అతని గురించి బ్యాడ్ కమెంట్స్ మాత్రం రావు. ఏదేమైనా విజయ్ దేవరకొండతో చేసే సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టిన నిర్మాతలే మళ్లీ అడ్వాన్స్ లు ఇస్తామంటూ ఎగబడతాడు. కానీ ఇప్పటికైనా అడ్వాన్స్ ల కోసం కాకుండా నిజాయితీగా చేసేలా ఉంటేనే అతను అడ్వాన్స్ �