విరూపాక్ష టెంపుల్ లో నిఖిల్ సినిమా ప్రారంభం

‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్.. ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లేటెస్ట్ గా ‘ది ఇండియా హౌస్’ సినిమాని ప్రారంభించాడు. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తుండడం విశేషం. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హంపీలోని విరూపాక్ష టెంపుల్ లో ముహూర్తాన్ని జరుపుకుంది. ఈ చిత్రంలో నిఖిల్ కి జోడీగా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. ఇతర ప్రధాన పాత్రలో బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు. త్వరలోనే.. ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకోనుంది.

Related Posts