కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన నాగార్జున

కొన్నాళ్లుగా కెరీర్ లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు నాగార్జున. తన ఇమేజ్ తో పాటు దాన్ని దాటి చేస్తోన్న సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడం లేదు. బంగార్రాజు మాత్రమే ఈ మధ్యలో కొంత ఊరటగా నిలిచింది.ఇప్పుడు అర్జెంట్ గా నాగార్జునకు ఓ బ్లాక్ బస్టర్ కావాలి.ప్రస్తుతం 99వ సినిమా చేస్తున్నాడు.

ఇది హిట్ అయితే తన కెరీర్ లో మెమరబుల్ మైల్ స్టోన్ లాంటి 100వ సినిమాకు మైలేజ్ వస్తుంది. ఆ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ 99వ సినిమా విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. కథ విషయంలో ఓ క్లారిటీ రాలేదు. దీనికోసం చాలా టైమ్ తీసుకున్నాడు.

ఓ దశలో దర్శకుడిని మార్చాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఇంకొందరు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. ఇదే టైమ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించే సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ ను అటు మేకర్స్ కానీ ఇటు నాగ్ కానీ ఖండించలేదు.. కన్ఫార్మ్ చేయలేదు. కాకపోతే అతను చేస్తున్నాడు అనే అంటున్నారు.


ఇక లేటెస్ట్ గా నాగ్ 99వ సినిమాకు సైన్ చేశాడు. కాకపోతే అంతా అనుకున్నట్టుగా ప్రసన్నకుమార్ కాదు. అతని దర్శకత్వంలో సినిమా ఉంటుంది కానీ ఇప్పుడే కాదట. ఈ లోగా మళయాలంలో సూపర్ హిట్ అయిన “పొరింజు మరియం జోస్”అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఈ రీమేక్ ను విజయ్ బిన్ని అనే సినిమాటోగ్రాఫర్ హ్యాండిల్ చేయబోతున్నాడు.

ఈ కథను తెలుగుకు అడాప్ట్ చేసిన విధానం నాగార్జునకు బాగా నచ్చిందట. అందుకే