Ajay atul : ఆదిపురుష్ కోసం మ్యూజిక్ డైరెక్టర్స్ సాహసం

ఆదిపురుష్‌ ప్రమోషన్స్ జోష్ గా మొదలు కాబోతున్నాయి. ఈ నెల 6న తిరుపతిలో మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సెలెక్టెడ్ సిటీస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. బట్ తిరుపతి ఫంక్షన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది యూనిట్. ఇండియాలోనే తిరుపతి టెంపుల్ అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసు కాబట్టి.. ఆ ఫంక్షన్ కు వచ్చే సెలబ్రిటీస్ అంతా బాలాజీ దర్శనం కూడా చేసుకునేలా ప్లాన్ చేశారు.

ఇక కృతి సనన్, ప్రభాస్ సీతారాములుగా నటించిన ఆదిపురుష్ పై దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉందిప్పుడు. ఈ క్రేజ్ ను కరెక్ట్ గా క్యాష్‌ చేసుకోవాలంటే ప్రమోషన్స్ ను పక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం మెయిన్ టీమ్ అంతా కష్టపడాలి. అందులో భాగంగానే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒక ద్వయం అయి అజయ్ అతుల్ ఓ సాహసం చేయబోతున్నారు.


అజయ్ – అతుల్ అంటే మరాఠీలో తిరుగులేని సంగీత దర్శకులు. ఎంతో టెక్నాలజీ వచ్చినా ఇప్పటికీ లైవ్ ఆర్కెస్ట్రాలోనే మ్యూజిక్ కంపోజ్ చేయడం వీరి శైలి. కొన్నాళ్ల క్రితం వచ్చిన సైరాట్ మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయినా ఈ జంట సంగీత దర్శకులు ఆదిపురుష్ లో కొన్ని పాటలు కంపోజ్ చేశారు. వీరి ఆధ్వర్యంలో ఏకంగా 200 మంది మ్యూజీషియన్స్, సింగర్స్ తో తిరుపతి వేదికపై ఓ ప్రదర్శన ఉంటుందని చెబుతున్నారు. అలాంటి తిరుపతికి ఈ సంగీత దర్శకులు ముంబై నుంచి బైక్ పై రాబోతున్నారు. అజయ్ – అతుల్ ఇద్దరూ బైక్స్ పై తిరుపతికి రాబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. నిజానికి ఇదేమంత గొప్ప ఐడియా అయితే కాదు. అంత సేఫ్టీ కూడా కాదు. అయినా మూవీ ప్రమోషన్స్ గానూ పనికొస్తుందనే వీరు ఈ సాహసం చేస్తున్నారని టాక్. మరి వీరి సాహసం సినిమాకు ఎంత వరకూ పనికొస్తుందో చూడాలి.