మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఓ అంతులేని కథ

యూవీ క్రియేషన్స్ బ్యానర్ సినిమా అంటే మాగ్జిమం ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వారి ఆసక్తిని కూడా చంపేస్తూ రాధేశ్యామ్ టైమ్ లో వారితో ఓ ఆటాడుకుంది ఆ బ్యానర్. అప్పటి నుంచి వారికి కూడా ఆ బ్యానర్ అంటే నచ్చడం లేదు. ఏదైనా సినిమాలకు సంబంధించి సరైన అప్డేట్ ఇవ్వడంలో కానీ, రిలీజ్ డేట్ విషయంలో పక్కాగా ఉండటం కానీ ఈ బ్యానర్ కొన్నాళ్లుగా చేయడం లేదు అనేది అందరికీ తెలుసు. అదే మరోసారి రిపీట్ అయింది.

మంచి క్రేజీ కాంబినేషన్ అని.. అనౌన్స్ మెంట్ తో ఆకట్టుకుని ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెంచిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మంచి బజ్ వచ్చింది. దాన్ని క్యాష్‌ చేసుకోవడంలో ఈ బ్యానర్ పూర్తిగా విఫలమైంది. సమ్మర్ లో విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. నిజానికి సమ్మర్ లో సరైన సినిమాలు పడలేదు. ఆ టైమ్ లో వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ అయి ఇప్పటికే ఓటిటిల్లోకి వచ్చేది.

తర్వాత జూన్, జూలై ఇలా డేట్స్ మారుతూనే వెళ్లాయి. చివరికి ఆగస్ట్ 4న అని అఫీషియల్ గానే అనౌన్స్ చేసినా రిలీజ్ కు పది రోజుల ముందే ప్రేక్షకులకు ఈ సినిమా రాదు అని అర్థమైంది. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. వాళ్లు చెప్పినట్టు జరిగి ఉంటే ఈ రోజు సినిమా విడుదలై ఉండేది.


ఆగస్ట్ 4న రావడం లేదు అని చెబుతూ.. మరో కొత్త డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని ఓ ప్రకటన ఇచ్చారు. బట్ నెక్ట్స్ రిలీజ్ డేట్ విషయంలో కూడా అదే కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోందట. ఇప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే అంశాన్ని తేల్చుకోలేకపోతోందీ బ్యానర్. ప్రస్తుతానికైతే ఆగస్ట్ 18న అని వినిస్తోంది.. అదే టైమ్ లో 25