బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో కార్తీ

కార్తీ అంటే తెలుగు హీరో కూడా అనేంతగా మన దగ్గర అభిమానులతో పాటు మార్కెట్ ను కూడా సంపాదించుకున్నాడు. కమర్షియల్ సినిమాలతో పాటు విమర్శకులను మెప్పించే సినిమాలు సైతం చేస్తూ వస్తున్నాడు కార్తీ. అతని లాస్ట్ మూవీ సర్దార్ తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ తమిళ్ లో బ్లాక్ బస్టర్.

ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్స్ ను సెలెక్ట్ చేసుకునే కార్తీ ఈ దీపావళికి జపాన్ అనే సినిమాతో వస్తున్నాడు. టైటిల్ వెరైటీగా ఉంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ అట్రాక్టివ్ గా ఉంది.

అందుకే ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఇది కార్తీకి 25వ సినిమా కావడం విశేషం. నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రాన్ని సూదుకవ్వమ్, కాదలుమ్ కాదందు పోగుమ్ అనే సినిమాలు చేసిన నాలన్ కుమారస్వామి డైరెక్ట్ చస్తున్నాడు.


ఇక లేటెస్ట్ గా కార్తీ 27వ సినిమా కూడా అనౌన్స్ అయింది. తమిళ్ లో 96 అనే సినిమాతో మొత్తం తమిళనాడును ప్రేమలో పడేసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తో కార్తీ సినిమా చేస్తున్నాడు. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ కు తమిళనాడు ఫిదా అయింది. తెలుగులోనూ అదే దర్శకుడు శర్వానంద్, సమంతలతో రీమేక్ చేశాడు. కానీ ఇక్కడ వర్కవుట్ కాలేదు.

ఇంత గ్యాప్ తర్వాత అతను కార్తీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫీ అందించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది కూడా ఆయనే కావడం విశేషం. అరవింద్ స్వామి మరో కీలక పాత్ర చేస్తున్నాడు. ఇక సంగీత దర్శకుడుగా మరోసారి 96 ఫేమ్ గోవింద్ వసంత నే రిపీట్ చేస్తున్నాడు. కోలీవుడ్ లో అనౌన్స్ మెంట్ తోనే అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసిందీ కాంబినేషన్. మరి సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి.