రెండు సీక్వెల్స్ ను లైన్లో పెట్టిన కార్తీ

‘పొన్నియన్ సెల్వన్, సర్దార్’ విజయాలతో మంచి ఫామ్ లోకి వచ్చాడనుకున్న కార్తీకి తన 25వ సినిమా ‘జపాన్’ ఘోర పరాజయాన్ని అందించింది. దీపావళి కానుకగా తెలుగు, తమిళం భాషల్లో విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లోనూ నెగటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు తన్ అప్ కమింగ్ మూవీస్ పైనే ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం కార్తీ, కృతి శెట్టి జంటగా ‘వా వాతియారే’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా తర్వాత కార్తీ బ్యాక్ టు బ్యాక్ రెండు సీక్వెల్స్ ను పట్టాలెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు.

ఈమధ్య అన్ని ఇండస్ట్రీలలోనూ సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. హిట్టైన సినిమాల క్రేజ్ ను సూపర్ లెవెల్ లో వాడుకోవడానికి సీక్వెల్స్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. ఈకోవలోనే కార్తీ తన సూపర్ హిట్ మూవీస్ ‘ఖాకీ, ఖైదీ’ సీక్వెల్స్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడట.

2017లో వచ్చిన ‘ఖాకి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతోనే డైరెక్టర్ హెచ్.వినోద్ బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అజిత్ తో వరుస సినిమాలు చేశాడు వినోద్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఖాకి’ సీక్వెల్ కి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నాడట. ప్రెజెంట్ కోలీవుడ్ న్యూ ట్రెండ్ డైరెక్టర్స్ లో హెచ్.వినోద్ తో పాటు లోకేష్ కనకరాజ్ ను కూడా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది కార్తీనే. కార్తీ, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన ‘ఖైదీ’.. లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ కి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ‘ఖైదీ 2’కి కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. త్వరలోనే ఈ రెండు సీక్వెల్స్ పైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రానున్నాయట.

Related Posts