కమల్ హాసన్ కొత్త సినిమా.. రైజ్ టు రూల్

లోక నాయకుడు కమల్ హాసన్ కు దాదాపు పదిహేనేళ్ల తర్వాత వచ్చిన సాలిడ్ బ్లాక్ సబ్టర్ అంటే విక్రమ్ అనే చెప్పాలి. లోకేష్‌ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో కమల్ ఏకంగా 400 కోట్ల వరకూ కలెక్ట్ చేసుకున్నాడు. పైగా ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే కావడంతో అటు హీరోగా, ఇటు నిర్మాతగా డబుల్ బొనాంజా అయిందీ సినిమా.

విక్రమ్ తర్వాత చాలామంది ఇతర భాషల్లో తమ సీనియర్ హీరోలతో ఆ తరహా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది నిజం. ఇక ప్రస్తుతం భారతీయుడు2తో పాటు ప్రాజెక్ట్ కే చిత్రాల్లో నటిస్తోన్న కమల్ హాసన్ లేటెస్ట్ గా తన సొంత బ్యానర్ లో మరో మూవీ ప్రారంభించాడు. కమల్ హాసన్ కు ఇది 233వ సినిమా.


ఇంతకు ముందు కార్తీతో ఖాకీ అనే సినిమా తీసి తెలుగులోనూ విజయం సాధించిన దర్శకుడు హెచ్ వినోత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇతను అజిత్ తో వరుసగా నీర్ కొండ పార్వై, వలిమై, తునివు అనే చిత్రాలు రూపొందించి విజయాలు సాధించాడు.

అలాంటి దర్శకుడితో కమల్ హాసన్ సినిమా అంటే ఖచ్చితంగా ఆయన ఇమేజ్ తో పాటు ఇంకేదో స్పెషల్ కంటెంట్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ లో కమల్ హాసన్ చేతిలో ఓ కాగడా పట్టుకుని ఉన్నాడు. ” రైజ్ టు రూల్ .. ” అనే క్యాప్షన్ కూడా ఉంది.

అంటే ఇదో రెబల్ తరహా చిత్రమే అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ తరహా చిత్రాలకు కమల్ హాసన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆర్ఆర్ తో పాటు ఈ అనౌన్స్ మెంట్ లో కొంత విక్రమ్ ఛాయలు కనిపిస్తున్నా.. అంతకు మించిన కంటెంట్ ఇంకేదో ఉందని తమి�