హనుమాన్ టీమ్కు భారత హోం మంత్రి అమిత్షా ప్రశంసలు దక్కాయి. అన్ని వర్గాల నుంచి ఇనాన్మస్గా మెప్పు పొందిన హనుమాన్ మూవీ ఇప్పుడు అమిత్షాని ఆకర్షించింది. ఈ చిత్ర టీమ్ .. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమిత్షాను హనుమాన్ టీమ్ కలిసింది. హను-మాన్ బృందం అమిత్ షాకు హనుమంతుడి షీల్డ్ను బహుకరించింది.
“ఇటీవలి సూపర్హిట్ చిత్రం హనుమాన్ లోని ప్రతిభావంతులైన నటుడు శ్రీ తేజాసజ్జా, చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మను కలవడం జరిగింది. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంప్రదాయాలను, వాటి నుండి ఉద్భవించిన సూపర్ హీరోలను చిత్ర యూనిట్ అద్భుతంగా చూపించింది. హనుమాన్ టీమ్కి వారి భవిష్యత్ ప్రాజెక్ట్లకు శుభాకాంక్షలు”అని రాశారు అమిత్ షా. ఈ ఫోటోలో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా చూడవచ్చు.
అమిత్షా స్పందనతో హనుమాన్ టీమ్ ఆనందంతో తడిసి ముద్దయ్యారు. “మిమ్మల్ని కలవడం ఒక గొప్ప అదృష్టం సార్ మీ మంచి మాటలు, ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.అమిత్షా సార్ని కలవడం మాకు గర్వకారణం. మీ మంచి మాటలకు ధన్యవాదాలు సార్ అంటూ ట్వీట్ చేసారు తేజ సజ్జా.
ఈ సినిమా త్వరలో ఓటీటీ విడుదల కానుంది. మరోవైపు, ప్రశాంత్ వర్మ హను-మాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రీ-ప్రొడక్షన్లో నిమగ్నమై వున్నారు.