Adipurush : ఆదిపురుష్‌ ప్రీ రీలీజ్ కోసం అద్భుతమైన ప్లాన్స్

ఇండియాస్ డార్లింగ్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్‌ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి అద్భుతమైన హంగామా మొదలైంది. ఒక్కో పాటతో అంచనాలు పెంచుతున్నారు. ట్రైలర్ తర్వాత అంచనాలు మొదలైన ఈ మూవీకి సంబంధించిన ప్రతిదీ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలో ఈ నెల 6న తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కుఏర్పాట్లు మొదలయ్యాయి. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి ఇదే ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్. శ్రీ రాముడి సినిమా ఫంక్షన్ ను వెంకటేశ్వరుడి సాక్షిగా మొదలుపెట్టబోతోంది మూవీ టీమ్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ఫంక్షన్ ఇంతకు ముందెప్పుడూ జరగలేదు అనేలా చేయబోతున్నారట. అందుకోసం ప్లానింగ్స్ అన్నీ ఎప్పుడో పూర్తయినా.. ఏర్పాట్లు తాజాగా మొదలయ్యాయి.


ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి న భూతో అన్నట్టుగా నిర్వహించబోతున్నారని టాక్. ఏ మాటకు ఆ మాటే.. ఇప్పటి వరకూ ఆదిపురుష్‌ కు సంబంధించి ఇంకా అంచనాలు మొదలు కాలేదు. చాలామంది ఈగర్ గా ఎదురుచూస్తున్నా.. ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం హై లెవల్లో ఉన్నాయి అని చెప్పలేం. వాటిని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పెంచబోతున్నారు. ఇందుకోసం ముంబై నుంచి 200 మంది డ్యాన్సర్స్ ను,200 మంది సింగర్స్ ను రప్పిస్తున్నారట. అంతే కాదు.. ఈ ఫంక్షన్ లో కాల్చే బాణా సంచాతో జై శ్రీ రామ్ అనే నినాదం వినిపించేలా ప్లానింగ్స్ చేస్తున్నారట. నినాదం వినిపించడం కుదరకపోతే కనీసం గాలిలో ఆ పేరు కనిపించేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించిన ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన అప్డేట్ అయితే ఇది. 200 మంది డ్యాన్సర్లు, 200 మంది సింగర్స్ అంటే స్టేడియం సంగతేమో కానీ అసలు వేదిక సరిపోతుందా అనేదే పెద్ద డౌట్. మరి వీరిని ఒకేసారి వాడేస్తారా లేక విడతల వారీగా ఆడి పాడిస్తారా అనేది ఇంకా తెలియదు.