పొంగల్ పోరులో మాజీ భార్యాభర్తలు

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మామూలుగా లేదని ఇప్పటివరకూ చర్చించుకుంటున్నాము. అయితే.. అటు తమిళనాట పొంగల్ పోరు కూడా రసవత్తరంగా మారుతోంది. పొంగల్ కానుకగా ఇప్పటికే రజనీకాంత్ నటిస్తున్న ‘లాల్ సలామ్‘, శివ కార్తికేయన్ ‘అయలాన్‘ సినిమాలు బెర్తులు ఖరారు చేసుకున్నాయి. తాజాగా.. పొంగల్ బరిలో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్‘ కూడా చేరింది.

ధనుష్ సినిమాల్లోనే సమ్ థింగ్ స్పెషల్ గా ‘కెప్టెన్ మిల్లర్‘ రూపొందుతోంది. ‘సాని కాయిదం‘ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని అసలు డిసెంబర్ లోనే తీసుకొద్దామనుకున్నారు. కానీ.. లేటెస్ట్ గా 2024, పొంగల్ కానుకగా ‘కెప్టెన్ మిల్లర్‘ విడుదలకానున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో.. తమిళనాట పొంగల్ బరిలో మాజీ భార్యాభర్తల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్‘. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ లు హీరోలుగా నటిస్తున్నారు. తెలుగు నటీమణి జీవిత రాజశేఖర్ మరో కీలక పాత్ర పోషిస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘జైలర్‘తో సూపర్ ఫామ్ లోకి వచ్చిన రజనీకాంత్ స్టార్ డమ్ తో ‘లాల్ సలామ్‘పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఐశ్వర్య మాజీ భర్త ధనుష్ కూడా రంగంలోకి దిగడంతో రాబోయే పొంగల్ పోరు రసవత్తరంగా మారబోతుంది. మరోవైపు.. ‘లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్‘ �